Telugu Gateway
Politics

డిఎస్ తో ఈటెల రాజేందర్ భేటీ

డిఎస్ తో ఈటెల రాజేందర్ భేటీ
X

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వరస పెట్టి భేటీలు జరుపుతున్నారు. ఆయన మంగళవారం నాడు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో సమావేశం అయి పలు అంశాలపై చర్చించారు. బుధవారం నాడు ఈటెల రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా డీఎస్‌తో ఈటెల చర్చలు జరిపారు. వరస పెట్టి భేటీలు సాగిస్తున్న ఈటెల త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించారు.తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్నానని ఈటెల రాజేందర్ తెలిపారు.

భేటీ ముగిసిన సమయంలో అక్కడికి వచ్చిన డీఎస్ తనయుడు బీజేపీ ఎంపీ అరవింద్ ను కూడా ఈటల కలిసి మాట్లాడారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఈటెల వస్తే స్వాగతిస్తామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితోపాటు తాజాగా సిఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క కూడా ప్రకటించారు. అయితే ఈటెల రాజేందర్ సొంత పార్టీ పెడతారా లేక ఏదైనా పార్టీలో చేరతారా అన్న అంశంపై స్పష్టత రావటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Next Story
Share it