Telugu Gateway
Politics

సీఎం కేసిఆర్ ను జైల్లో పెట్టే దమ్ముందా నీకు?

సీఎం కేసిఆర్ ను జైల్లో పెట్టే దమ్ముందా నీకు?
X

బండి సంజయ్ పై ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు కొడితే నువ్వు మానేరు డ్యాములో పడతావు అంటూ వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ ను జైల్లో పెట్టే దమ్ముందా నీకు అని ప్రశ్నించారు. బండి సంజయ్ కొత్త బిక్షగాడు అంటూ ఎద్దేవా చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం నాడు వరంగల్ లో మీడియాతో మాట్లాడారు. 'నాలుగుసార్లు ఓడాడని జాలి తో కనికరించి , కరీంనగర్ ప్రజలు గెలిపించారు. సంజయ్...ఇదే నీకు మొదటిది చివరి పదవి. ప్రశాంతంగా..ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టకు. మిషన్ భగీరథ కు, మిషన్ కాకతీయ కు నిధులు తెచ్చావా?. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు డబ్బులు తెచ్చావా?. నువ్వు ఏమి చేశావో.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి తెచ్చావో చెప్పగలవా. లేదంటే నిన్ను కరీంనగర్ ప్రజలే ఉరికిచ్చి కొడతారు. మిమ్మల్ని గెలిపించిన దుబ్బాకలోనే మిమ్మల్ని ఉరికించి కొడతారు.

ఢిల్లీ ఆందోళన గురించి మాడ్లాడని బీజేపీ, కేవలం మీడియాలో హైప్ కోసం హైదరాబాద్ మీద, సీఎం కేసిఆర్ మీద మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బలహీన పడటం వల్ల, మత తత్వం సెంటిమెంట్ తో దేశంలో గెలిచారు. బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. కేసీఆర్ గురించి మాట్లాడితే, పెద్ద వాడివి కాలేవు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించ రని గుర్తు పెట్టుకోండి. కెసిఆర్ మీలా అల్లాటప్పా లీడర్ కాదు. కేసిఆర్ ఉద్యమ నాయకులు. తెలంగాణ తెచ్చిన ప్రజా నేత. తెలంగాణ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టీ, చావు నోట్లో తల పెట్టీ, తెలంగాణ తెచ్చారు. కేటీఆర్, కవిత ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళే.

భాగ్యలక్ష్మి ఆలయాన్ని అడ్డుపెట్టుకుని మత కలహాలు సృష్టించాలని సూచిస్తున్నావు. బీజేపీ నేతలు మూర్ఖులు. మత ఘర్షణలు పెట్టాలని చూస్తున్నారు. కరోనా కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికలు ముందు పెట్టాల్సి వచ్చింది.ముందు అయితే ముందు అంటారు. వెనుకకు అయితే, వెనక అంటారు. మేయర్ ఎన్నికలకు ఇంకా రెండు నెలల టైముంది... ఇప్పుడే ఎందుకు తొందర..? ఒక వారంలోనే రిజిస్ట్రేషన్ సమస్య పూర్తవుతుంది. ప్రజల కోసమే కొత్త రెవెన్యూ చట్టం తెచ్చాం. రిజిస్ట్రేషన్స్ కూడా బాగున్నాయి అని ప్రజలు అభినందిస్తారు.' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it