ఢిల్లీ చేరిన ఈటెల రాజేందర్
BY Admin14 Jun 2021 4:59 AM GMT
X
Admin14 Jun 2021 4:59 AM GMT
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజకీయంగా సోమవారం నుంచి కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారు. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈటెల బిజెపిలో చేరనున్నారు. దీని కోసం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈటెల రాజేందర్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ ఉన్నారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే ఢిల్లీకి రావాల్సిందిగా బిజెపి అధిష్టానం సూచించటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. పదిన్నరకే ఢిల్లీ చేరుకున్న ఈటెల రాజేందర్ బిజెపి జాతీయ ప్రెసిడెంట్ జె పి నడ్డా ను కలసి పార్టీలో చేరనున్నారు.
Next Story