Telugu Gateway
Politics

మీ రాజకీయాల కోసం పీవీ, ఎన్టీఆర్ ల పేర్లు వాడొద్దు

మీ రాజకీయాల కోసం పీవీ, ఎన్టీఆర్ ల పేర్లు వాడొద్దు
X

అద్వానీని బిజెపి ఎంత గౌరవించిందో తెలుసు

సొంత పార్టీకి చెందిన నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్ లను గౌరవించుకోలేని బీజేపీ పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను బీజేపీ-ఎంఐఎంలు తుచ్ఛరాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గం అని విమర్శించారు. నిజంగా పీవీ, ఎన్టీఆర్ లపై బీజేపీకి ప్రేమ ఉంటే వారిద్దరికి భారతరత్న ఇవ్వాలన్నారు. 29న నగరానికి వస్తోన్న అమిత్ షా ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ప్రతి రోజు రాత్రి బండి సంజయ్, అరవింద్ – అసద్, అక్బర్ ల మధ్య ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తోంది... దీనికి సంధానకర్త అమిత్ షా అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రి పూట అంతా కలిసి స్క్రిప్ట్ తయారు చేసుకోవడం... ఉదయం సురభి నాటకానికి తెర లేపటం ఇదే జరుగుతోంది. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదు. ప్రజలు ఇలాంటి ఎమోషన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story
Share it