Telugu Gateway
Politics

ఐసీయూలో అహ్మద్ పటేల్

ఐసీయూలో అహ్మద్ పటేల్
X

కరోనాతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కు ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ కావటంతో ఐసీయూలోకి మార్చారు. అహ్మద్ పటేల్ వయస్సు 71 సంవత్సరాలు. ఆయన కరోనా బారిపడినట్లు అక్టోబర్ 1న ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

పటేల్ ప్రస్తుతం గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అక్టోబర్‌ 1 నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ చేరిందని వెల్లడించారు. అహ్మద్ పటేల్ పూర్తిగా కోలుకుని అరోగ్యంతో తిరిగిరావాలని కాంగ్రెస్ నేతలు ఆకాంక్షిస్తున్నారు.

Next Story
Share it