ముందు దోశ ద్రోహి ముద్ర.. ఆ తర్వాత ఐటి దాడులు
ఈడీ, ఐటి దాడులకు భయపడం
నా ఫాంహౌస్ లోకి వస్తే నాలుగు ముక్కలు అవుతావు కొడకా
ఫాంహౌస్ దున్నటానికి నువ్వు ఏమైనా ట్రాక్టర్ డ్రైవర్ వా?
బండి సంజయ్ పై కెసీఆర్ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మరోసారి బిజెపిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరు కేంద్రాన్ని ప్రశ్నిస్తే వారికి దేశద్రోహుల ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. 'రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు మద్దతు ఇచ్చినప్పుడు మేము దేశద్రోహులు కాదు. పార్లమెంట్లో బిల్లులకు మద్దతు ఇచ్చినప్పుడు కూడా మేము దేశద్రోహులు కాదు. కానీ ఇప్పుడు దేశద్రోహులయం అయ్యాము. ప్రజల పక్షాన ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్లు దేశద్రోహులు. అంటే బీజేపీ ఈ దేశంలో దేశద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీనా? గట్టిగా ఎవరు మాట్లాడితే వాళ్లు దేశద్రోహులా? ఇది బీజేపీ స్టయిల్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎవరు గట్టిగా మాట్లాడి కేంద్రాన్ని నిలదీసినా వాళ్లు దేశద్రోహులు అయిపోతారు. బీజేపీ రెండు రకాల స్టాంపులు రెడీ చేసి పెట్టుకుంది. ఒకటి దేశద్రోహులు. రెండు అర్బన్ నక్సల్స్ అంటూ ముద్ర వేస్తారని మండిపడ్డారు. కెసీఆర్ సోమవారం నాడు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కెసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...'దొంగలు భయపడతారు...మేం ఎందుకు భయపడతాం?. మాట్లాడితే కెసీఆర్ ఫాంహౌస్ దున్నుతా అంటున్నావు. నువ్వు ఏమైనా ట్రాక్టర్ డ్రైవర్ వా దున్నటానికి. నాకు మనీలాండరింగ్..బొండరింగ్ లేదు.
కంపెనీలు లేవు...దందాలు లేవు. నన్ను ఏమీ చేయలేవు. వాళ్లను వీళ్ళను చేసినట్లు నన్నేమి చేయలేవు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి చేయకపోవటానికి వేరే కారణాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లినా ప్రజలు ఆమోదించారు. నేను సూట్ కేసులు ఇచ్చానా?. అది చేసేది మీరు. అతి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేది మీరే. అరాచకం మీదే. మ్యాన్ డేట్ రాకపోయినా ప్రభుత్వాలను పడగొట్టి అరాచకాలు చేసింది ఎవరు. ఇదేనా మాట్లాడేది. నువు మందు తాగుతావ్. ఎప్పుడైనా మందు పోసినవా నాకు. నువ్వు వచ్చి కలిపినవా. ఇదేనా మాట్లాడేది. నీకు గురువు నేర్పింది ఇదేనా? నా ఫాంహౌస్ లోకి అడుగు పెట్టు..నాలుగు ముక్కలు అవుతావు కొడకా? లంగా మాటలు మాట్లాడతావు. దేశ ఖజానాలో మా వాటా ఉంది. మీ అయ్య సొత్తు ఉందా? మేం ఎవరితో అయినా ఎందాక అయినా కొట్లాడతాం. గొర్ల పైసలు కేంద్రం ఇచ్చింది అని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా.
మాకు ఎవరూ బాస్ లేరు. మాకు బాస్ లు తెలంగాణ ప్రజలు. వాళ్లు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎన్నో ఎన్నికలు మేం భయంకరంగా గెలిచాం. తెలంగాణకు బండి సంజయ్, బిజెపి ఏం చేసిందో చెప్పాలి. అసలు తెలంగాణలో వడ్లు కొంటారా?. కొనరా. ఇది మాట్లాడకుండా సొల్లు మాట్లాడితే ఎలా?. నేను పోయి పోయి చైనాలో డబ్బులు దాచుకున్నానా. కేంద్రం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిందా. మేం ఇచ్చాం. ఇంకా 70-80 వేలు ఇస్తాం. చైనా వాడు మన భూభాగం గుంజుకోవద్ద అన్నా. ఇదేమైనా తప్పా. దీనికి దోశద్రోహం అంటారా?. యాడికెళ్లి పట్టుకొచ్చారు మీరు నాకు కూడా అర్ధం కాదు. వడ్లు కొనాలని వచ్చే శుక్రవారం రోజున రాష్ట్రం అంతటా ధర్నా చేస్తున్నాం. భూ భాగాన్ని కాపాడమన్నడో దేశ ద్రోహ..మందికి విడిచిపెట్టినవాడు దేశ ద్రోహ?. వ్యక్తిగతమైన దూషణలు ఇదా?.' అంటూ మండిపడ్డారు. నీలాంటి ఎంపీలను చేశా. నువ్వో తోకగాడివి. ఎంత మంది ఎంపీలను..ఎమ్మెల్యేలను సృష్టించాం. రాష్ట్ర సృష్టికర్తను..జెండా, పార్టీ సృష్టికర్తను అన్నారు.