Telugu Gateway
Politics

కెసీఆర్ ఫ్యామిలీకి లక్ష కోట్లు..రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల అప్పు

కెసీఆర్ ఫ్యామిలీకి లక్ష కోట్లు..రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల అప్పు
X

బిజెపి ఎంపీ అరవింద్ మరోసారి సీఎం కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఫ్యామిలీ లక్ష కోట్ల రూపాయలు దోచుకునేందుకే తెలంగాణను నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బఫూన్లు పాలిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, పోలీస్ అధికారులు రోహింగ్యాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నగరంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన అరవింద్ రోహింగ్యాలపై ట్విట్టర్ పిట్ట కేటీఆర్ ఎందుకు కూయటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఖర్చు చేసి‌న 500 కోట్ల రూపాయలను ఎన్ఆర్ఐ సెల్ కోసం ఖర్చు చేయాల్సిందన్నారు. మొక్కలు పేరుతో దోచుకోవటానికే 500కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం తోలు తీయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. హోంమంత్రి మహమూద్ అలీకి లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో కూడా తెలియదని విమర్శించారు.

కేసీఆర్, కేటీఆర్‌లు తోలు తీస్తామంటున్నా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పౌరుషం రావటం లేదని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లాలో బోగస్ అడ్రసులో పాస్ పోర్టులు జారీ చేస్తున్నారన్నారు. రోహింగ్యాలు దేశ భద్రతకే సవాల్‌గా మారారన్నారు. మయన్మార్‌లో వందల మంది హిందువులను హతమార్చారన్నారు. ఐరిష్, బయోమెట్రిక్ లేకుండానే ఆధార్ కార్డులను సంపాదిస్తున్నారన్నారు. ముస్లింలు జనాభాలో మాత్రమే పెరిగారు తప్ప.. జీవన ప్రమాణాలు కాదన్నారు. భారత్‌లో మాత్రమే ముస్లింలకు భద్రత ఉందన్నారు. దేశద్రోహులతో కొట్లాడే ఒకే ఒక్కడు నరేంద్ర మోదీ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it