కొత్త మంత్రులకు కీలక శాఖలు ఇచ్చిన జగన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రులకే కీలక శాఖలు ఇచ్చారు. గత కేబినెట్ కూ..ఇప్పటికీ చూస్తే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణకు మాత్రమే అన్యాయం జరిగినట్లు కన్పిస్తోంది. గత కేబినెట్ లో అత్యంత కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రి గా పనిచేసిన ఆయనకు ఈ సారి మాత్రం విద్యా శాఖతో సరిపెట్టారు. గతంలో ఆయన నిర్వహించిన శాఖతో పోలిస్తే ఇది డిమోషన్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తొలిసారి మంత్రి అయిన అంబటి రాంబాబుకు అత్యంత కీలకమైన జలవనరుల శాఖ ఇచ్చారు. గతంలో ఈ శాఖను తొలిసారి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిర్వహించిన విషయం తెలిసిందే. గుడివాడ అమర్నాధ్ కు కూడా అత్యంత కీలకమైన పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖతో పాటు ఐటి శాఖను అప్పగించారు. అందరూ ఊహించిననట్లే ఆర్ధిక శాఖను మళ్ళీ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి కేటాయించారు.
ఇతర మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిమూలపు సురేష్ : మున్సిపల్ శాఖ, అర్బన్ డెవలప్మెంట్
బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ
బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం)
బుగ్గన రాజేంద్రనాథ్ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవరాహాల శాఖ
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్
దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ
ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్
గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ
జోగి రమేష్ : గృహనిర్మాణ శాఖ
కాకాణి గోవర్థన్రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)
నారాయణ స్వామి : ఎక్సైజ్ శాఖ (డిప్యూటీ సీఎం)
ఉషాశ్రీ చరణ్ : స్త్రీ శిశు సంక్షేమ
మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ
పినిపే విశ్వరూప్ : రవాణా శాఖ
రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం)
ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక, మత్స్య శాఖ
తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
విడదల రజిని : వైద్యం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య
ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)