Telugu Gateway
Politics

కర్నూలులో చంద్రబాబుపై కేసు నమోదు

కర్నూలులో చంద్రబాబుపై కేసు నమోదు
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై ఏపీలో కొత్త కేసు నమోదు అయింది. ఆయనపై కర్నూల్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. సుబ్బయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అని సుబయ్య పిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. 2005 ప్రకృతి వైఫరిత్యాల చట్టంలోని సెక్షన్‌ 4 కింద కేసు చేసినట్లు సమాచారం. ప్రకృతి వైఫరిత్యాల చట్టం కింద నాన్‌బెయిల్‌ సెక్షన్లు పెట్టారు.

Next Story
Share it