Telugu Gateway
Politics

ఆ అప్పు ర‌హ‌స్యంగా ఏమీ తీసుకోలేదు

ఆ అప్పు ర‌హ‌స్యంగా ఏమీ తీసుకోలేదు
X

ఏపీ ఆర్దిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి 25 వేల కోట్ల రూపాయ‌ల అప్పు వివాదంపై స్పందించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చేసిన అప్పు ర‌హ‌స్యంగా చేసిందేమీకాద‌న్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకే పీఏసీ ఛైర్మన్ ప‌య్యావుల కేశ‌వ్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. అమ్మ ఒడి, ఆసరా, చేయూత పథకాల కోసమే అప్పు తీసుకున్నామని, జీవోల ప్రకారమే అప్పు తీసుకున్నామన్నారు. ఇందులో ర‌హ‌స్యం ఏమీలేద‌ని తెలిపారు.

టీడీపీ హయాంలో వేల కోట్ల అప్పులు చేశారు.. అనుమతులు తీసుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ''టీడీపీ హయాంలో 96 వేల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రభుత్వం మారింది.. మేం అప్పులు కడుతున్నామని'' బుగ్గన తెలిపారు. ఏపీకి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు, కార్యదర్శులతో చర్చిస్తున్నామని, ఢిల్లీ పర్యటనలపై తప్పుడు ప్రచారం చేయొద్ధని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు.

Next Story
Share it