కవిత కోసం బిఆర్ఎస్ మొత్తాన్ని కదిలించిన కెసిఆర్

కానీ ఏ కేసు ల సమయంలో స్పందించని రీతిలో కవిత కేసు ఒక్క కేసు విషయంలో స్పందించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తేడా ఎందుకో అందరికి తెలుసు. కవిత కు నోటీసు లు ఇస్తే దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలపై ఉన్న కేసు లు...ఇతర పార్టీ ల నుంచి బీజేపీ లో చేరి కేసుల విచారణ తప్పించుకున్న వారి పేర్లను బిఆర్ఎస్ నేతలు చెపుతూ పోతున్నారు. వాళ్ళ వాదన ఎలా ఉంది అంటే బీజేపీ లో అంత మంది మీద కేసు లు ఉన్నాయి కాబట్టి మా వాళ్ళ మీద కేసు లు ఎలా పెడతారు అని అన్న చందంగా ఉంది అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. . ఒక్క మాట మాత్రం నిజం. బీజేపీ లో ఉన్న నేతలు చాలా మంది పై కేసు లు ఉన్నాయి. ఇది బహిరంగ రహస్యమే. కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే తనయుడు ఎనిమిది కోట్ల నగదు తో దొరికిన అరెస్ట్ లు లేవు. చట్టాలు అన్ని ఇప్పుడు బీజేపీ కి అనుకూలంగా పనిచేస్తున్నాయి. టార్గెట్ చేసిన వాళ్ళ విషయంలో మాత్రం స్పీడ్ గా ఉంటున్నాయి. మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ అనుకూల వాతావరణాన్ని ఎలా వాడుకుతుందో అన్నది వేచిచూడాల్సిందే. బిఆర్ఎస్ నేతలు బీజేపీ నేతల స్కాం లో జాబితా చెపుతుంటే...తెలంగాణ బీజేపీ నేతలు కవిత గతంలో చెప్పిన మాటల అప్పు తీసుకుని ఇల్లు కొన్నాను..షో మాన్ షిప్ ఉండదు మా దగ్గర అన్న మాటలు...ఇప్పుడు 20 లక్షలు పెట్టి వాచ్ కొనుక్కున్నాను..నేను డబ్బులు లేని కుటుంబంలో పుట్టలేదు అని చెప్పిన మాటలను వైరల్ చేస్తున్నారు. అటు వైపు..ఇటు వైపు కూడా వీడియో ల గేమ్ కూడా జోరుగా నడుస్తోంది.