Telugu Gateway
Politics

కెసీఆర్ ఎప్పుడైనా జైలుకొళ్లొచ్చు

కెసీఆర్ ఎప్పుడైనా జైలుకొళ్లొచ్చు
X

అందుకే టెంట్లు...ఫ్రంట్ల పేరుతో డ్రామాలు

కెసీఆర్ అవినీతిపై కేంద్రం సీరియ‌స్

బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 317 జీఓను సవరించాలని బీజేపీ పోరాటం చేస్తున్న అంశాన్ని డైవర్ట్ చేసేందుకే సీఎం కెసీఆర్ భేటీల పేరుతో డ్రామాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆయ‌న బుధ‌వారం నాడు హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 'లాలూ ప్రసాద్ వేల కోట్లు దోచుకున్నడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా లక్షల కోట్లు దోచుకున్నడు. అందుకే ఇక్కడ దోచుకోవడమెలా అనే అంశంపై శిక్షణా సమావేశాలు పెట్టినట్లుండు. వీళ్లంతా కలిసి ''దోచుకోండి-దాచుకోండి'' పార్టీ పెడుతరేమో. అయినా ఇక్కడికి వచ్చినోళ్లకైనా బుద్ది ఉండాలి. గత ఎన్నికలప్పుడు ఆయా పార్టీలందరికీ ఈ సీఎం పైసలిచ్చిండు. ములాయం సింగ్ కొడుకొచ్చినా, లాలూ ప్రసాద్ కొడుకొచ్చినా తాలిబన్, అల్ ఖైదా, ఐఎస్ఐ, రోహింగ్యాలను ఎవరిని తీసుకొచ్చినా... నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు ఎక్కడ వున్నా నిన్ను గుంజుకొచ్చి జైల్లో వేసేది ఖాయం. ఎందుకంటే నువ్వు పెద్ద అవినీతి పరుడివి. నువ్వు రాష్ట్రాన్ని దోచుకుంటున్న సంగతిపై కేంద్రం సిరియస్ గా ఉంది. నీ అవినీతిపై కేంద్రం చర్యలకు సిద్దమైంది. ఈ సంగతి నీకు తెలుసు.

అందుకే ఫ్రంట్ టెంట్ పేరుతో డ్రామాలు చేస్తున్నవ్. ఎప్పుడైనా జైల్ కు వెళ్ళొచ్చు. జైలుకు వెళ్లే విషయం కెసిఆర్ కు తెల్సి పోయింది .. అందుకే సానుభూతి సంపాదించుకునేందుకు కమ్యూనిస్టుల తోను, విపక్ష పార్టీల నేతల తో భేటీ అవుతున్నడు. తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పసుగ్రాశం కుంభకోణం కేసులో జైల్ కు వెళ్లి వచ్చిండు... నిన్న ప్రగతి భవన్ కు వచ్చి జైలు జీవితం ఎలా వుంటుందో తేజస్వీ ఈ సీఎంకు వివరించి ఉంటాడు. ఎట్లాగూ కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమనే విషయం కమ్యూనిస్టులకు, విపక్ష నేతలకు తెలిసిపోయింది కాబట్టే కేసీఆర్ ను పరామర్శించేందుకు వస్తున్నారు' అంటూ వ్యాఖ్యానించారు. ఎందుకు తెలంగాణ సాధించామో అందుకు భిన్నంగా రాష్ఠ్రంలో పాలన కొనసాగుతోంద‌ని విమ‌ర్శించారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా "ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువకులు నేటి మలిదశ తెలంగాణ పోరాటానికి ఎంతైనా అవసరం ఉందన్నారు.

Next Story
Share it