మళ్ళీ రెండు వేల రూపాయల నోట్ల రద్దు చర్చ!
చిన్న నోట్లు రద్దు చేసి పెద్ద నోట్లను చెలామణిలో ఉంచడం సరికాదని సుశీల్ కుమార్ మోడీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లో కూడా పెద్ద నోట్లు చెలామణిలో లేవన్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు రెండేళ్ల వ్యవధి ఇచ్చి ఆ తర్వాత కేంద్రం రద్దు చేస్తే బాగుంటుందని సుశీల్ మోదీ సూచించారు. ఏటీఎంలలో కూడా 2 వేల నోట్ల రూపాయలు రావడం లేదని కూడా ఆయన కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. 2 వేల రూపాయల నోట్లపై అనేక అపోహలున్నాయని, వాటిపై కేంద్రం స్పష్టతనీయాలని సుశీల్ మోడీ కోరారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల దగ్గర నుంచి ఈ నోట్లు ఎప్పుడో మాయం అయ్యాయి. అసలు ఇవి ఎవరి దగ్గర ఉన్నాయనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.