Telugu Gateway
Politics

వైసీపీలో వెన్నుపోటుదారులను అధిష్టానం గుర్తించాలి

వైసీపీలో వెన్నుపోటుదారులను అధిష్టానం గుర్తించాలి
X

వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరి మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్ధులు బరిలో నిలవటంపై ఆమె మండిపడ్డారు. వీళ్ళ తీరు టీడీపీ గెలిచినా పర్వాలేదు కానీ..వైసీపీ మాత్రం గెలవకూడదు అన్నట్లు ఉందని విమర్శించారు. వైసీపీ ఓటమికి కొంత మంది సొంత పార్టీ నేతలే పనిచేశారని ఆరోపించారు. వారు రాసిన లేఖలు చేసిన..చేసిన వీడియోలు అన్నీ అధిష్టానం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. 14 మంది రెబల్స్ ను బరిలోకి దింపటంతోపాటు వాళ్ళు గెలిచేందుకు నగదు కూడా అందజేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి ప్రయత్నించిన వారే ఇప్పుడు కూడా రంగంలోకి దిగారన్నారు. ఈ వెన్నుపోటుదారులను అధిష్టానం గుర్తించాలన్నారు.

నగరి, పుత్తూరులో వైసీపీ గెలవకూడదని కొంత మంది కుట్రలు చేశారని..అయితే వారి కుట్రలు ఏ మాత్రం సాగవన్నారు. వీరి తీరు తల్లి పాలు తాగి గుండెలపై తన్నిన విధంగా ఉందని విమర్శించారు. నగరంలోని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని రోజా కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగానైతే వైసీపీ ఘన విజయం సాధించిందో అదే విధంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్నారని ఆమె అన్నారు.

Next Story
Share it