చంద్రమండలంలో దాక్కున్నా వదిలిపెట్టం
వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని..అక్రమాలకు కొమ్ముకాస్తున్న వారు చంద్రమండలంలో దాక్కున్నా వదిలిపెట్టమని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కె. అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన అబద్దాలకు, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం దారుణమన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తల్ని అందుకు సహకరించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం. అకారణంగా అధికారమదంతో వైసీపీ వాళ్లు చేస్తున్న దుశ్చర్యలకు ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు గుంటూరు జిల్లా , పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో వైసీపీ కార్యకర్తలు మాజీ జడ్పీటీసీ బత్తిన శారద ఇంటిపై దాడి చేసి ఇల్లు, బైక్లు దగ్ధం చేయడాన్న తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
వినాయక ఊరేగింపులో ఇలాంటి అరాచకం ఏంటి? ఘటన స్ధలంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటం పోలీసు వ్యవస్ధ పనితీరుకు అద్దం పడుతోంది. టీడీపీ కార్యకర్తల ఇల్ల మీదకు వచ్చి వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది? పోలీసుల సమక్షంలో దాడులు జరుగుతున్నందుకేనా రాష్ర్ట పోలీసులకు అవార్డులు వచ్చింది. హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ విధంగా దాడులు జరుగుతున్నాయింటే రాష్ర్టంలో పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోంది. బత్తిన శారద ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. అసలు ఏంటి ఈ అరాచకం తాలిబన్ల రాజ్యం స్ధాపిద్దామనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ కి, ఆఫ్ఘనిస్తాన్ కి తేడా ఏంటి? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.