సుప్రీంలో లంచ్ మోషన్ వేస్తాం
BY Admin21 Jan 2021 9:00 AM GMT
X
Admin21 Jan 2021 9:00 AM GMT
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేయనున్నట్లు ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలసి కుట్ర చేశారని ఆరోపించారు. ఎస్ఈసీ అధికారులతో సమావేశం పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి చేతనైతే తిరుపతి ఉప ఎన్నికను రిఫరెండంగా తీసుకోవాలని పెద్దిరెడ్డి ఛాలెంజ్ చేశారు.
Next Story