Telugu Gateway
Politics

హ‌రిబాబుకు గ‌వ‌ర్న‌ర్ పద‌వి..హ‌ర్యానాకు ద‌త్త‌న్న‌

హ‌రిబాబుకు గ‌వ‌ర్న‌ర్ పద‌వి..హ‌ర్యానాకు ద‌త్త‌న్న‌
X

కేంద్రం మంగ‌ళ‌వారం నాడు ప‌లువురు కొత్త గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించ‌టంతోపాటు మ‌రికొంత మందిని బ‌దిలీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించిన విశేషాలు కూడా ఉన్నాయి. ఏపీకి చెందిన బిజెపి సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ కంభంపాటి హ‌రిబాబుకు మిజోరం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. ప్ర‌స్తుతం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న బండారు ద‌త్తాత్రేయ‌ను హర్యానా గ‌వ‌ర్న‌ర్ గా బ‌దిలీ చేశారు. కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లాట్ ను నియ‌మించారు.

గోవా గవర్నర్‌గా శ్రీధరన్‌ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్‌), హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్రన్‌ విశ్వనాథ్‌ను నియ‌మించారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగూబాయి చగన్‌భాయ్‌ పటేల్‌, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య, జార్ఖండ్‌ గవర్నర్‌గా రమేష్‌ బయాస్‌ నియమితులయ్యారు.ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ముందే కేంద్రం.. గవర్నర్ల నియామకాలను జరిపింది. దీంతో బుధ‌వారం నాడు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిగే అవకాశం ఉంద‌నే అంచ‌నాలు ఉన్నాయి.

Next Story
Share it