విజయవాడలో కాల్పులు..పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి హత్య
BY Telugu Gateway11 Oct 2020 6:01 AM GMT
X
Telugu Gateway12 Oct 2020 4:09 PM GMT
తుపాకీ కాల్పుల మోతతో విజయవాడ ఉలిక్కిపడింది. ఈ మధ్య కాలంలో ఈ తరహా హత్య జరగటం ఇదే మొదటిసారి. అందులో హత్యకు గురైంది పోలీసు కమిషనరేట్ ఉద్యోగి కావటం మరో కీలక అంశంగా మారింది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తున్న మహేష్ అనే ఉద్యోగి నగర శివార్లలోని బైపాస్ రోడ్డులో ఓ బార్ లో కూర్చుని మద్యం సేవిస్తున్నాడు.
ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారమే కొంత మంది వ్యక్తులు అక్కడికి వచ్చి తొమ్మిది రౌండ్లు కాల్పులు జరపటంతో మహేష్ అక్కడికి అక్కడే మరణించాడు. మహేష్ శరీరంలోకి మూడు బుల్లెట్లు దిగాయి. ఈ కాల్పుల అనంతరం దుండగులు కారులో పరారీ అయి..కారును కొద్దిదూరం వెళ్ళిన తర్వాత రోడ్డుపక్కన వదిలేసి వెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Next Story