Telugu Gateway
Cinema

'మహాసముద్రం' విడుదల ఆగస్టు 19న

మహాసముద్రం విడుదల ఆగస్టు 19న
X

మరో కొత్త సినిమా విడుదల తేదీ ప్రకటించింది. గతంలో ఎన్నడూలేని రీతిలో టాలీవుడ్ ఈ సారి వరస పెట్టి సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తూ పోతోంది. ఈ పరిణామం చూసిన వారు కూడా ఒకింత ఆశ్చర్యపోతున్నారు. ఇదేదో వేలం పాట తరహాలో అన్నట్లు ఈ తేదీలు వస్తున్నాయి. తాజాగా శర్వానంద్, సిద్ధార్ధ్ లు నటిస్తున్న 'మహాసముద్రం' సినిమాను ఆగస్టు 19న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్నారు.

ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.' అంటూ 'మహా సముద్రం' టీమ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత సిద్ధార్ధ్ తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story
Share it