టాప్ ఫైవ్ సినిమాల జాభితాలో పఠాన్ కు చోటు
జనవరి 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఈ సినిమా ఇండియా లో 623 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్ లో 377 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పఠాన్ సినిమా లో షారుఖ్ ఖాన్ కు జోడిగా దీపికా పదుకొనె, విల్లన్ గా జూన్ అబ్రహం లు నటించిన విషయం తెలిసిందే. చాలాకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తన పఠాన్ సినిమా ద్వారా తిరిగి జోష్ తెచ్చాడని చెప్పొచ్చు. ఒక వైపు సౌత్ సినిమాలు దుమ్ము రేపుతుంటే ఇటీవల బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి.