Telugu Gateway
Cinema

ఇంత స్వార్ధ‌మా.. టాలీవుడ్ పై వ‌ర్మ ఫైర్

ఇంత స్వార్ధ‌మా.. టాలీవుడ్ పై వ‌ర్మ ఫైర్
X

వివాదస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ టాలీవుడ్ పై ఫైర్ అయ్యారు. ఆయ‌న ముఖ్యంగా ప్ర‌ముఖ న‌టుడు కృష్ణంరాజు మ‌ర‌ణం సంద‌ర్భంగా ప‌రిశ్ర‌మ వ్య‌వ‌హ‌రించాల్సిన తీరు ఇది కాదంటూ మండిప‌డ్డారు. దీనిపై వ‌ర‌స ట్వీట్లు చేశారు. ఇది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వ‌ర్మ చేసిన ట్వీట్లు ఇలా ఉన్నాయి. ' మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు.

ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి , మోహనబాబుగారికి, బాలయ్యకి , ప్రభాస్ కి,మహేష్,కల్యాణ్ కు నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!' అంటూ రాసుకొచ్చారు.

Next Story
Share it