Telugu Gateway
Cinema

ప్రభాస్ చేతిలో సినిమాలే...సినిమాలు!

ప్రభాస్ చేతిలో సినిమాలే...సినిమాలు!
X

మైత్రీ మూవీ మేకర్స్ మరో భారీ బడ్జెట్ సినిమాకు ప్లాన్ చేస్తోందా..అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తాజాగా బాలీవుడ్ లో పఠాన్ సినిమాతో పెద్ద సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు సిద్దార్ద్ ఆనంద్ తో ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన యెర్నేని నవీన్ భేటీ అయ్యారు. దీనికి సంబదించిన ఫోటోలు ఇప్ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు విషయం ఏమిటి అంటే సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వం లో మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్. అందుకే ఈ భేటీ జరిగింది అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ప్రభాస్ చేతిలో భారీ భారీ ప్రాజెక్టులు ఉండటంతో ఈ కొత్త ప్రాజెక్ట్ కు సమయం పట్టొచ్చు.

ఇప్పుడు ప్రభాస్ ఒకవైపు ఆదిపురుష్, సాలార్ తో పాటు ప్రాజెక్ట్ కే (నాగ్ అశ్విన్ ) ప్రాజెక్టులు చేస్తున్నారు. మరి కొన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. అయితే బాలీవుడ్ కు ఈ మధ్య కాలంలో పఠాన్ వంటి హిట్ దక్కలేదు. ఈ సినిమా తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 634 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఏ హిందీ సినిమాకు ఇటీవల కాలంలో ఇంతటి భారీ వసూళ్లు రాలేదు అని పరిశ్రమ టాక్. పఠాన్ హిట్ తో సిద్దార్ద్ ఆనంద్ కు డిమాండ్ మరింత పెరిగింది అనే చెప్పాలి. అందులో భాగంగానే మైత్రీ కూడా ఆయనతో ఒక సినిమాకు రెడీ అయింది అని చెపుతున్నారు. ఈ వివరాలు అధికారికంగా ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.

Next Story
Share it