Telugu Gateway
Cinema

రోడ్డు ప్ర‌మాదంలో హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు గాయాలు

రోడ్డు ప్ర‌మాదంలో హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు గాయాలు
X

టాలీవుడ్ హీరో సాయిధ‌ర‌మ్ తే్జ్ శుక్ర‌వారం రాత్రి బైక్ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. గాయ‌ప‌డిన స‌మ‌యంలో అప‌స్మార‌క స్థితికి చేరుకున్నా త‌ర్వాత కోలుకున్నారు. ప్ర‌మాదం విష‌యం త‌లిసిన వెంట‌నే ఆయ‌న్ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి అపోలో ఆస్ప‌త్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ బైక్ ప్ర‌మాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్ కాల‌ర్ బోన్ ఫ్రాక్చ‌ర్ అయింది. అదే స‌మ‌యంలో కుడి క‌న్ను పై భాగంలో కొద్దిపాటి గాయాలు అయ్యాయి. సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం సేఫ్ గా ఉన్నార‌ని..ఎలాంటి ప్రమాదంలేద‌ని అపోలో వైద్యులు త‌మ హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు.

అయితే మ‌రికొన్ని గంట‌లు ఆస్ప‌త్రిలోనే అబ్జ‌ర్వేష‌న్ లో ఉంచ‌నున్నారు. జూబ్లీ హిల్స్‌ రోడ్డు నంబర్‌-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా అతను ఈ ప్రమాదానికి గురయ్యాడు. ప్ర‌మాద విష‌యం తెలుసుకున్న వెంటనే చిరంజీవి, ప‌వ‌న్ కళ్యాణ్ లు ఆస్ప‌త్రికి వెళ్ళి ప‌రిస్థితి అడిగి తెలుసుకున్నారు. తాజాగా చిరంజీవి ట్వీట్ చేస్తూ సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని..అభిమానులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

Next Story
Share it