Telugu Gateway
Cinema

చిరంజీవి రాజ‌కీయ ట్వీట్ టార్గెట్ తెలంగాణానా..ఏపీనా?!

చిరంజీవి రాజ‌కీయ ట్వీట్ టార్గెట్ తెలంగాణానా..ఏపీనా?!
X

రాజ‌కీయ నాయ‌కులు కాంట్రాక్ట్ లు చేయ‌టం కామ‌న్. కొంత మంది నేరుగా చేస్తారు..మ‌రికొంత మంది ప‌రోక్షంగా ప‌నులు చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విష‌యమే. గాడ్ ఫాద‌ర్ సినిమా పేరుతో మొత్తానికి చిరంజీవి రాజ‌కీయంగా ర‌చ్చ రచ్చ చేస్తున్నారు. ఆయ‌న త‌న మ‌న‌సులో ఏమి ఉందో బ‌య‌ట‌కు చెప్ప‌కుండా సినిమా పేరుతో డైలాగ్ లు మాత్రం ఒక్కొక్క‌టీ విడుద‌ల చేస్తూ త‌న సినిమాకు హైప్ తెచ్చుకునే ప‌నిలో ఉన్నారు. తాజాగా ఓ కీల‌క రాజ‌కీయ డైలాగ్ ను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. అయితే చిరంజీవి ఇది ఏపీ రాజ‌కీయ నాయ‌కుల‌నుద్దేశించి చేశారా...లేక తెలంగాణ నాయ‌కుల‌నుద్దేశించా అన్న చ‌ర్చ సాగుతుంది.

' ఇన్నాళ్ళూ రోడ్డు కాంట్రాక్టులు..ఇసుక కాంట్రాక్టులు. కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు. నీళ్ల కాంట్రాక్టులు..మందు కాంట్రాక్టులు అంటూ ప్ర‌జ‌ల సొమ్ము అడ్డంగా తిని బ‌లిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్క‌ళ్ళూ. ఇక నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నా. ఇందులో ఒక‌టే రూల్. ఇక నుంచి ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించాల‌నే నిర్ణ‌యం, త‌ప్పు చేయాలంటే భ‌యం మాత్ర‌మే మీ మ‌న‌సులో ఉండాలి. లేదంటే మీ ఊపిరిలో గాల్లో క‌ల‌సిపోతుంది' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తోపాటు గాడ్ ఫాదర్ చిత్రానికి పవర్ ఫుల్ డైలాగ్స్ సమకూర్చిన లక్ష్మీభూపాల్ కి నా అభినందనలు! మంచి ప్రతిభ ఉన్న నీకు మరెంతో మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నాను అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ లోని అంశాలు చాలా వ‌ర‌కూ రెండు రాష్ట్రాల్లో కామ‌న్ గా ఉన్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it