Telugu Gateway
Cinema

బిగ్ బాస్ లో పేలని దీపావళి బాంబులు

బిగ్ బాస్ లో పేలని దీపావళి బాంబులు
X

అఖిల్ ఎలిమినేషన్..తుస్ మన్పించిన నాగార్జున

బిగ్ బాస్ లో దీపావళి బాంబులు ఏమీ పేలలేదు. ఏదో చేద్దామని..ఏదో చేసి అంతా తుస్ మన్పించారు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు సీరియస్ పోటీదారుడో అతన్ని బయటకు పంపాలని బిగ్ బాస్ ఇఛ్చిన టాస్క్ లో సభ్యులంతా అఖిల్ ను ఇందుకు ఎంచుకున్న విషయం తెలిసిందే. హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నట్లు పంపించి సీక్రెట్ రూమ్ లో ఉంచి షో నడిపించారు. కానీ దీపావళి రోజు మాత్రం హోస్ట్ నాగార్జున 'అఖిల్ నీ కాలుక్యేషన్లు తప్పు. బ్యాగ్ సర్దుకో. స్టేజీ మీదకు వచ్చేయ్. ఐయామ్ వెయిటింగ్ ఫర్ యూ' అంటూ ప్రకటించారు. అంతే అఖిల్ ఏడ్పు మొదలుపెట్టి వీక్ క్యాండిడేట్లతో గేమ్ ఎలా ఆడతారు అంటూ ప్రశ్నిస్తాడు. అంతే కాదు..మరో ఛాన్స్ ఇవ్వాలని ప్రాథేయపడతారు. ఇతర భాషల్లో కూడా కొన్ని చోట్ల ఇలాగే జరిగిందని..తన చేతిలో ఏమీలేదని..హౌస్ లో కి వెళ్లి ఫోటో దిగి అందరి సభ్యుల్లాగే బయటకు వచ్చేయాలని సూచించారు.

నాగార్జున చెప్పిన ప్రకారమే హౌస్ లోకి వెళ్ళి అంతా పూర్తి చేసుకున్న తర్వాత చివర్లో అంతా తూచ్..అఖిల్ హౌస్ లోనే ఉంటాడు అని ప్రకటించారు. అంతే కాదు..ఏదో కుండల టాస్క్ పెట్టి ఆయన్ను ఏకంగా కెప్టెన్ చేశారు. అఖిల్ హౌస్ నుంచి వెళ్ళిపోతున్నాడని భావించిన సోహైల్, మోనాల్ లు ఏడుపులు చివరకు ఆగిపోయాయి. అయితే సీక్రెట్ రూమ్ లో ఉన్నప్పుడు తాను బయటకు వెళ్లాక సభ్యులు మాట్లాడిన మాటలు అన్నీ విన్న అఖిల్ హౌస్ లో అభిజిత్, హారిక, లాస్య, మెహబూబ్ లను ఉతికి ఆరేశాడు. ముఖ్యంగా అభిజిత్, లాస్య, హారిక లు ఘాటు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నామినేషన్ లో ఉన్న వారిలో అభిజిత్ ఒక్కరే సేవ్ అయ్యారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆదివారం తేలనుంది. అయితే ఇప్పటికే ఎలిమినేషన్ మొహబూబ్ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఇది నిజమో కాదో.

Next Story
Share it