Telugu Gateway
Andhra Pradesh

వైసీసీ రాజ్య‌స‌భ అభ్య‌ర్ధులు వీళ్లే

వైసీసీ రాజ్య‌స‌భ అభ్య‌ర్ధులు వీళ్లే
X

ర‌క‌ర‌కాల ఊహ‌గానాల మ‌ధ్య వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డికి మ‌రోసారి రాజ్య‌స‌భ చాన్స్ ద‌క్కింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. వైసీపీ ద‌క్క‌నున్న నాలుగు రాజ్య‌స‌భ స్థానాల‌కు చెందిన అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించారు. సీఎంతో భేటీ అనంత‌రం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ఈ పేర్ల‌ను ప్ర‌క‌టించారు. విజ‌యసాయిరెడ్డితోపాటు న్యాయ‌వాది నిరంజ‌న్ రెడ్డి, బీద మ‌స్తాన్ రావు, ఆర్. క్రిష్ణ‌య్య‌ల‌కు ఛాన్స్ ద‌క్కింది. సీఎం జ‌గ‌న్ తెలంగాణ‌..ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాకుండా బ‌ల‌హీన వ‌ర్గాల వారికి ప్రాతినిధ్యం క‌ల్పిస్తున్నార‌ని తెలిపారు. నాలుగు సీట్ల‌లో రెండు వెన‌క‌బ‌డిన వ‌ర్గాల వారికి కేటాయించామ‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎప్పుడూ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అన్నారు.

Next Story
Share it