ఇరకాటంలో వైసీపీ

పైకి పర్యాటక శాఖ పేరు చెపుతున్నా ఇవి సీఎం జగన్ కోసమే నిర్మిస్తున్నారు అనే ప్రచారం అటు వైసీపీ వర్గాలతో పాటు...అధికార వర్గాల్లోనూ ఉంది. రేపు దసరా కు సీఎం జగన్ వైజాగ్ కు షిఫ్ట్ అయి రుషికొండ కు వెళితే అప్పుడు ఖచ్చితంగా చిక్కులు వస్తాయనే చర్చ కూడా సాగుతుంది. వైసీపీ ట్వీట్ పెద్ద ఇరకాటమే తెచ్చిపెట్టినట్లు అయింది. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని అయినా సీఎం జగన్ తన క్యాంపు ఆఫీస్ గా వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక పేరు చెప్పి నిర్మాణాలు చేపట్టి..మరో అవసరానికి వాడితే ప్రభుత్వమే ఏదో దొంగతనంగా పనులు చేసినట్లు అవుతుంది కదా అని ఒక అధికారి సందేహం వ్యక్తం చేశారు. వైసీపీ శాసనరాజధానిగా ప్రకటించిన అమరావతి లో నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా అక్కడ మాత్రం ఒక్క పని కూడా మొదలుపెట్టని సీఎం జగన్..వైజాగ్ లో మాత్రం పర్యాటక శాఖ పేరుతో భారీ ఎత్తున కొత్త నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఇవి ఎందుకు అనే విషయం భవిష్యత్తులో అయినా ప్రజలకు తెలియదా...అప్పుడు ప్రభుత్వ బండారం బయటపడదా. తొలుత వైసీపీ చేసిన ట్వీట్ లో గతంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు టీడీపీ నాయకులే 450 ఎకరాలు దోచుకున్నారు అని అనలేదా అంటూ ప్రశ్నించారు.