Telugu Gateway
Andhra Pradesh

శ్రీకాకుళం టూ అనంత‌పురం..వైసీపీ బ‌స్సుయాత్ర‌

శ్రీకాకుళం టూ అనంత‌పురం..వైసీపీ బ‌స్సుయాత్ర‌
X

ఏపీలో అధికార వైసీపీ రాజ‌కీయ కార్య‌క్ర‌మాల వేగం పెంచింది. ఓ వైపు గ‌డ‌ప గ‌డ‌ప‌కూ ప్ర‌భుత్వం చేస్తూనే..ఇప్పుడు బ‌స్సు యాత్రకు కూడా రంగం సిద్ధం చేసింది. అయితే పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తో సంబంధం లేకుండా మంత్రులు.ఇత‌ర నాయ‌కులు అంద‌రూ ఇందులో పాల్గొన‌నున్నారు. ముఖ్యంగా సామాజిక న్యాయం పేరుతో వైసీపీ ప్ర‌భుత్వం చేసిన కార్య‌క్ర‌మాలు..ఇచ్చిన ప‌ద‌వుల వంటి అంశాల‌ను హైలెట్ చేస్తూ ఇది సాగ‌నుంది. ఈ యాత్ర విశేషాల‌ను మంత్రులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు మీడియాకు వివ‌రించారు. 'ఈ నెల 26 నుంచి 29 వరకు మంత్రుల బస్సు యాత్ర ఉంటుందని తెలిపారు. 'సామాజిక న్యాయం అనే బస్సు యాత్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టబోతున్నది. శ్రీకాకుళం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. నాలుగు రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది.దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం ఇస్తున్న ప్రభుత్వం ఇది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్య, సామాజిక అభివృద్దికి మూడేళ్లుగా కంకణం కట్టుకున్నారు. ఈ విషయాలు రాష్ట్రమంతా చెప్పాలనే బస్సు యాత్ర చేస్తున్నాం. ఇలాంటి వర్గాలను గౌరవించకుండా మోసగించిన వాళ్లు ప్రజల మధ్యకు వెళ్లి మేము ఏమీ చేయలేదని చెప్తున్నారు. అందుకే మేమే ప్రజల్లోకి వెళ్లి ఏమీ చేశామో సామాజిక విప్లవం ఎలా జరిగిందో చెప్తాం. బస్సు యాత్ర శ్రీకాకుళంలో ప్రారంభమై అనంతపురంలో ముగుస్తుంది. రోజుకో పెద్ద బహిరంగ సభ ఉంటుంది.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ పాల్గొంటారు. కేబినెట్‌లో 77 శాతం సభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. ఇలాంటి దాన్ని అభాసుపాలు చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది.రాజ్యసభ సీటును ఒక తెలంగాణ బీసీ వ్యక్తికి ఇస్తే తప్పు పడుతున్నారు. ఎక్కడున్నాడు అనేది కాదు.. ఆయా వర్గాల ఘోష వినిపించే వ్యక్తి కావాలి. చంద్రబాబు ఎక్కడు ఉంటున్నారు..? తెలంగాణలో కాదా..?. డీబీటీ నిధులు 80 శాతం అణగారిన వర్గాలకే వెళ్తోంది. ఏ రోజైనా టీడీపీ బీసీలకు ఒక్క రాజ్యసభ సభ్యత్వమైనా ఇచ్చిందా.? ధరల పెరుగుదల అంటున్నారు.. ఒక్క ఏపీలోనే పెరిగాయా...? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ధరలు పెరిగాయి. ఐదేళ్లు మీరు ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ నడిపారు. మాలాంటి వారు ప్రజలకు ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది' అన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోరిన సమ సమాజాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ చేసి చూపించారు. సీఎం జగన్‌ చేతల్లో చూపించిన విప‍్లవాన్ని ప్రజలకు వివరిస్తాం. 26న విజయనగరం, 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు జరుగుతాయని తెలిపారు.

Next Story
Share it