Telugu Gateway
Andhra Pradesh

ప‌ద‌విపై పార్టీనే ప్ర‌క‌ట‌న చేస్తుంది

ప‌ద‌విపై పార్టీనే ప్ర‌క‌ట‌న చేస్తుంది
X

ప్ర‌ముఖ న‌టుడు. వైసీపీ నేత అలీ మంగ‌ళ‌వారం నాడు తాడేప‌ల్లిలో సీఎం జ‌గ‌న్ తో స‌మావేశం అయ్యారు. ఇటీవ‌లే సినీ ప్ర‌ముఖుల‌తో క‌ల‌సి జ‌గ‌న్ ను క‌ల‌సిన వారిలో ఉన్న అలీ..సీఎంవో ఆహ్వానం మేర‌కు ప్ర‌త్యేకంగా మ‌రోసారి జ‌గ‌న్ తో స‌మావేశం అయ్యారు. సీఎంతో భేటీ అనంత‌రం అలీ మీడియాతో మాట్లాడారు. సీఎంతో భేటీ సంద‌ర్భంగా త్వరలోనే గుడ్‌న్యూస్‌ ఉంటుందని చెప్పార‌న్నారు.

తాను ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాన‌ని, త్వరలోనే త‌న పదవిపై పార్టీ ఆఫీస్‌ నుంచి ప్రకటన వస్తుంద‌న్నారు. రెండు వారాల్లోనే ప్రకటన ఉంటుందని అనుకుంటున్నాన‌ని తెలిపారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాన‌ని తెలిపారు. సామాన్యులకు కూడా సినిమా టికెట్‌ అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని, చిన్న సినిమాకు కూడా లాభం ఉండాలన్నదే త‌మ ఉద్దేశం అని తెలిపారు.

Next Story
Share it