Telugu Gateway
Andhra Pradesh

అంత కలవరపాటు ఏంటో !

అంత కలవరపాటు ఏంటో !
X

ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడి లేఖలో వైసీపీని అంతగా కలవర పెట్టే అంశాలు ఏమి ఉన్నాయి. అధికార పార్టీ..సీఎం జగన్ ఫ్యామిలికి చెందిన పత్రిక సాక్షి లో చంద్రబాబు లేఖపై స్పందించిన తీరు వైసీపీ నాయకులనే షాక్ కు గురి చేస్తోంది. ఇది అంతా చూస్తుంటే చంద్రబాబు లేఖ కంటే తమ ప్రచారమే ఆయనకు మరింత మేలు చేసి పెట్టేదిలా ఉంది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. చంద్రబాబు పేరిట విడుదల అయిన లేఖలో ఏదైనా తప్పు ఉంది అంటే...స్నేహ బ్లాక్, రాజమహేంద్రవరం జైలు నుంచి అనేది తప్ప మిగిలిన అంశాలు అన్ని రొటీన్ రాజకీయ అంశాలే. అధికారికంగా జైలు నుంచి లేఖ విడుదల చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ పార్టీ నాయకులు విడుదల చేసిన లేఖ కు జైలు నుంచి అని ప్రస్తావించటంతో జైలు అధికారులు కూడా వెంటనే రంగంలోకి దిగి...ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆ లేఖ జైలు నుంచి రాలేదు అని...ముద్దాయిలు ఎవరైనా సంతకంతో కూడిన లేఖ విడుదల చేయాలంటే అధికారులు దాన్ని పూర్తిగా పరిశీలించి...జైలు ముద్రతో విడుదల విడుదల చేస్తామని తెలిపారు. ఈ వివాదం తలెత్తిన తర్వాత తెలుగు దేశం కూడా దీనిపై స్పందించింది. నారా భువనేశ్వరి, లోకేష్ ల ములాఖత్ సందర్భంగా చెప్పిన అంశాలను లేఖ పేరుతో విడుదల చేశామని ప్రకటించారు. చంద్రబాబు లేఖ అలా బయటకు వచ్చిందో లేదో వైసీపీ ప్రభుత్వం తరపున మంత్రి అంబటి రాంబాబు పేరుతో ఒక కౌంటర్ లేఖ విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే సాక్షిలో అయితే ఏకంగా ఉత్తరం ఉత్తదే...చంద్ర లేఖలో ఇంద్ర జాలం అంటూ ఏకంగా బ్యానర్ స్టోరీ వేశారు. చంద్రబాబు రాసిన రొటీన్ లేఖపై అధికార వైసీపీ ఇంతగా ఎందుకు ఉలిక్కి పడుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మనీ లాండరింగ్ కేసు లో అరెస్ట్ అయి తీహార్ జైలు లో ఉన్న సుఖేష్ చంద్ర శేఖర్ పేరు తో అయన లాయర్ లు పలు లేఖలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it