వైసీపీ కి సిబిఐ వరస షాక్ లు !

అయితే ఈ దశలో తాము ఆ పేరు వెల్లడించలేము అని..కోర్టు కు అయితే సీల్డ్ కవర్ లో వివరాలు ఇస్తామని సిబిఐ తెలిపింది. వివేకా హత్యకు నిధులు సమకూర్చింది అవినాష్ రెడ్డి అని కోర్టు కు సిబిఐ నివేదించింది. ఈ పరిణామాలు అన్ని ఎటు వెళ్లి ఎటు వస్తాయో అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో ఉంది. ఇప్పటికే ప్రజల్లో పలు అంశాలపై వ్యతిరేకత ఉంది అని...వాటికి తోడు వై ఎస్ వివేకా హత్య కేసు లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ కి దారుణంగా నష్టం చేస్తాయని ఒక నేత అభిప్రాయపడ్డారు. సిబిఐ కూడా ఈ హత్య కేసు విచారణ సందర్భంగా అటు కోర్టు లోనూ ..ఇటు బయట కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటోంది. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో మోడీ సర్కారు అత్యంత శక్తివంతంగా ఉంది...దేశంలోని విపక్షాలు అన్నిటిని విచారణ సంస్థలతో వేధిస్తున్నారు అని పార్టీ లు అన్నీ ఆరోపిస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ ఇంకా మోడీ ఆధీనంలోని సిబిఐ ఓడిపోయి ఉన్న చంద్రబాబు, టీడీపీ నేతలు చెప్పినట్లు ఆడుతుంది అని విమర్శలు చేయటమే ఇందులో వెరైటీ అని చెప్పొచ్చు.