Telugu Gateway
Andhra Pradesh

అవినాష్ రెడ్డి, వైస్ షర్మిల ఫైట్ తప్పదా?!

అవినాష్ రెడ్డి, వైస్ షర్మిల ఫైట్ తప్పదా?!
X

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఈ సారి మరింత ఆసక్తి రేపేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో అన్న జగన్ కోసం రాష్ట్రమంతా పర్యటించిన వై ఎస్ షర్మిల ఈ సారి ఆయనకు వ్యతిరేకంగా మారారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షర్మిల కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దీంతో అందరి కళ్ళు ఈ సీటు పై పడబోతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ మరో సారి అవినాష్ రెడ్డి కే సీటు కేటాయించిన విషయం తెలిసిందే. షర్మిల రంగంలోకి దిగితే పోటీ మాత్రం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

అంతే కాదు షర్మిల కాంగ్రెస్ తరపున రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయనున్నందున ఇది అధికార వైసీపీ కి నష్టం చేసే అవకాశం ఉంది అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆమె చీల్చే ఓటు బ్యాంకు అంతా వైసీపీ దే ఉంటుంది అనే లెక్కలు ఉన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కడప ఎంపీగా దివంగత వై ఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పోటీ చేస్తారు అని కూడా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ కు సంబదించిన టిక్కెట్ల జాబితాను త్వరలోనే విడుదల చేయనుంది.

Next Story
Share it