Telugu Gateway
Andhra Pradesh

వివేకా హ‌త్య కేసు సాక్షి మృతి

వివేకా హ‌త్య కేసు సాక్షి మృతి
X

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కీలక మ‌లుపు. అత్యంత సంచ‌ల‌నం రేపిన ఈ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న గంగా్ధ‌ర్ రెడ్డి మ‌ర‌ణించారు. పోలీసులు దీన్ని అనుమానాస్ప‌ద మ‌ర‌ణం అనే కోణంలో విచార‌ణ సాగిస్తున్నారు. అనంత‌పురం జిల్లా యాడికిలోని ఆయ‌న ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. కుటంబ స‌భ్యులు అనారోగ్యంతో మ‌ర‌ణించార‌ని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అనుమాన‌స్ప‌ద మ‌ర‌ణంగా భావించి విచార‌ణ జ‌రుపుతున్నారు.

వివేకా హ‌త్య కేసులో సీబీఐ మూడుసార్లు గంగాధ‌ర్ రెడ్డిని విచారించింది. గంగాధ‌ర్ రెడ్డి మ‌ర‌ణంతో క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి ఇంటిని అన్ని కోణాల్లోనూ ప‌రిశీలించింది. మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసు ఏపీ రాజ‌కీయాల్లోనూ పెద్ద దుమారం రేపిన విష‌యం తెలిసిందే. గంగాధ‌ర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం త‌న‌కు ప్రాణ‌భ‌యం ఉంద‌ని పోలీసు అధికారుల‌ను కోరిన‌ట్లు స‌మాచారం. ఈ మ‌ర‌ణంతో కేసు కొత్త మ‌లుపు తిరిగిన‌ట్లు అయింది.

Next Story
Share it