Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు శస్త్రచికిత్సలు

వైసీపీ ఎమ్మెల్యే  రోజాకు రెండు శస్త్రచికిత్సలు
X

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్ కె రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. చెన్నయ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్సలు చేశారు. ఈ విషయాన్ని ఆమె భర్త సెల్వమణి తెలిపారు. ఆపరేషన్ల అనంతరం రోజాను ఐసీయూ నుంచి వార్డుకు తరలించారు. ఆమెకు ప్రస్తుతం రెండు వారాల పాటు విశ్రాంతి అవసరం వైద్యులు సూచించినట్లు ఆయన తెలిపారు.

ఆడియో సందేశం ద్వారా సెల్వమణి ఈ విషయాలు వెల్లడించారు. వాస్తవానికి రోజాకు ఈ ఆపరేషన్లు గత ఏడాదే నిర్వహించాల్సి ఉందని, కరోనాతోపాటు ఈ జనవరిలో ఎన్నికల కారణంగా వాయిదా పడ్డాయని తెలిపారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం కుదుటపడుతోందని, ఈ తరుణంలో సందర్శకులు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it