చంద్రబాబు మినహా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అసెంబ్లీకి హాజరుపై స్పష్టత వచ్చింది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున తాను సీఎంగా తప్ప..సభలో అడుగుపెట్టనని ప్రకటించి చంద్రబాబు సభ నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ శపథం చంద్రబాబుకే పరిమితమా?. లేక టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని పాటించాలా అన్న అంశంపై తర్జనభర్జనలు సాగాయి.
చివరకు చంద్రబాబు తప్పించి..అందరూ సభకు హాజరు కావాలని శనివారం నాడు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని కొందరు, వెళ్లవద్దని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారు.