టీడీపీలో వంద మందితో సూసైడ్ బ్యాచ్

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడేవారికి బుద్ధి చెప్పేందుకు వంద మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధం చేసుకున్నామని.. అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా.. చావడానికైనా సిద్దమని వెల్లడించారు. చంద్రబాబును తిడితే, టీడీపీ ఆఫీస్పై దాడి చేస్తే పదవులు వస్తాయనుకుంటున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.
సీనియర్లను కాదని జోగి రమేష్కి మంత్రి పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లినందుకే అని వాళ్ల పార్టీ నేతలే చెప్పారన్నారు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జోగి రమేష్ కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసానికి చేరుకోవటం అప్పట్లో పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే.
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTఅసెంబ్లీ రద్దుకు మేం రెడీ..పార్లమెంట్ రద్దుకు మీరు రెడీనా?
27 May 2022 2:15 PM GMTటాలీవుడ్ కు టిక్కెట్ రేట్ల షాక్
27 May 2022 10:30 AM GMTరాష్ట్రం పరువు తీస్తున్న జగన్
27 May 2022 9:33 AM GMTడ్రగ్స్ కేసులో షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
27 May 2022 8:23 AM GMT
జగన్ కుంభకోణాల టీజర్ వదిలిన నారా లోకేష్
27 May 2022 3:23 PM GMTకాంగ్రెస్ అంటేనే అన్ని కులాల కలయిక
26 May 2022 7:15 AM GMTమోడీ తెలంగాణ టూర్..టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి
26 May 2022 6:55 AM GMTఇక పార్టీ తోకలు తగిలించుకోదలచుకోలేదు
26 May 2022 5:22 AM GMTమీ వైఫల్యాలను మాపై రుద్దకండి
24 May 2022 2:00 PM GMT