Telugu Gateway
Andhra Pradesh

ఒకే రోజు క్యాబినెట్ అనుమతులు

ఒకే రోజు క్యాబినెట్ అనుమతులు
X

ఉర్సా క్లస్టర్స్ కు అరవై ఎకరాలు కేటాయింపుపై దుమారం

ఆంధ్ర ప్రదేశ్ ఐటి శాఖ వైజాగ్ లో టిసిఎస్ కంపెనీ కి 21.26 ఎకరాలు కేటాయిస్తూ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే క్యాబినెట్ లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే టిసిఎస్ కు మొత్తం 21 ఎకరాల భూమిని 99 పైసల కే కేటాయించారు. అంటే ఈ లెక్కన టిసిఎస్ కు కేటాయించిన భూమి ఎకరా ధర కేవలం 4 .71 పైసలు మాత్రమే. ఈ ల్యాండ్ లో ఏర్పాటు చేయబోయే క్యాంపస్ ద్వారా కంపెనీ 1370 కోట్ల రూపాయల పెట్టుబడితో 12000 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. అయితే టిసిఎస్ మాత్రం వచ్చే ఐదు నుంచి ఆరు సంవత్సరాల కాలంలో క్యాంపస్ ను పూర్తి చేయనుంది. దీని కోసం 20 నుంచి 25 ఎకరాల భూమి కేటాయించాల్సిందిగా కోరితే..ప్రభుత్వం వైజాగ్ లోని ఐటి హిల్ 3 లో ఈ 21 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

టిసిఎస్ భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన రోజే క్యాబినెట్ లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు భూ కేటాయింపు ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది. ఈ సంస్థకు విశాఖపట్నంలోని హిల్ నం.3 (SEZ)లోని IT పార్క్‌లో 3.5 ఎకరాల భూమిని, కాపులుప్పాడలో 56.36 ఎకరాల భూమిని కేటాయించటానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే రెండు నెలల క్రితం పెట్టిన ఈ సంస్థకు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఈ కంపెనీ సామర్ధ్యం పై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా లో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు రావటంతో ప్రభుత్వం టిసిఎస్ తో పాటు క్యాబినెట్ ఆమోదం పొందిన ఉర్సా క్లస్టర్స్ భూ కేటాయింపుల జీఓ మాత్రం జారీ చేయలేదు. ప్రస్తుతానికి ఇది పెండింగ్ లో పెట్టారా లేక ఒకటి రెండు రోజుల్లో తాము అనుకున్నట్లే పని పూర్తి చేసుకుంటారా అన్నది వేచిచూడాలి.

Next Story
Share it