Telugu Gateway
Andhra Pradesh

ఎస్ఈసీ అప్పీల్ పై విచారణ 18కి వాయిదా

ఎస్ఈసీ అప్పీల్ పై విచారణ 18కి వాయిదా
X

ఏపీలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న పంచాయతీ ఎన్నికల వ్యవహారం సస్పెన్స్ మరికొన్ని రోజులు కొనసాగనుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్ ను కొట్టేశారు. వ్యాక్సినేషన్ కు ఎలాంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సింగిల్ బెంచ్ ఆదేశాలు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశారు.

మంగళవారం నాడు ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన బెంచ్ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఎన్నికల కమిషనర్ తరపు న్యాయవాది అశ్విని కుమార్ ఎన్నికలు జరపాల్సిన అవసరాన్ని బెంచ్ కు వివరించారు. బుధవారం నుంచి కోర్టుకు సంక్రాంతి సెలవులు. దీంతో రెగ్యులర్ విచారణ కింద ఈ అంశంపై జనవరి 18న హైకోర్టు ఈ పిటీషన్ పై మరోసారి వాదనలు విననుంది.

Next Story
Share it