Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో న‌లుగురు స‌ల‌హాదారుల ప‌ద‌వీ కాలం పొడిగింపు

ఏపీలో న‌లుగురు స‌ల‌హాదారుల ప‌ద‌వీ కాలం పొడిగింపు
X

జాబితాలో స‌జ్జ‌ల‌..అజ‌య్ క‌ల్లాం, జీవీడీ, ర‌ఘురాం

ఏపీ ప్ర‌భుత్వంలో ఉన్న న‌లుగురు స‌ల‌హాదారుల ప‌ద‌వీ కాలాన్ని మ‌రో ఏడాది పాటు పొడిగిస్తూ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం నాడు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. ఏపీ ప్ర‌భుత్వంలో ప్ర‌జా వ్య‌వ‌హారాల స‌ల‌హాదారుగా ఉన్న స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ప‌ద‌వీ కాలాన్ని మ‌రో ఏడాది పొడిగించారు. ఆయ‌న‌తోపాటు అజయ్ కలాం, సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, తలశిల రఘురాం లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అజ‌య్ క‌ల్లాం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ముఖ్య స‌ల‌హాదారుగా ఉన్నారు.

కొద్ది రోజుల క్రితం ఆయ‌న‌కు ఉన్న కీల‌క శాఖ‌లు త‌ప్పించి..కేవ‌లం స‌ల‌హాదారు ప‌ద‌వికే ప‌రిమితం చేశారు. అప్ప‌ట్లోనే ఆయ‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటార‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఇప్పుడు ఆయ‌న‌కు మ‌రో ఏడాది పొడిగింపు ల‌భించింది. అజ‌య్ క‌ల్లాంకు ఇప్పుడు అద‌నంగా వైఎస్ఆర్ జ‌గ‌న‌న్న స్వ‌స్థ భూహ‌క్కు, భూ ప‌థ‌కం అమ‌లు క‌మిటీకి ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మిగిలిన స‌ల‌హాదారులు ఎవ‌రి ప‌ద‌వుల్లో వారు కొన‌సాగుతూ ఎక్స్ టెన్ష‌న్ పొందారు.

Next Story
Share it