Telugu Gateway
Andhra Pradesh

జ‌బర్ద‌స్త్ కు రోజా గుడ్ బై

జ‌బర్ద‌స్త్ కు రోజా గుడ్ బై
X

ఈటీవీలో ప్ర‌సారం అయ్యే కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ లో ఇక నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజా న‌వ్వులు క‌న్పించ‌వు. ఎందుకంటే ఆమెకు ఏపీ సీఎం జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌టంతో ఈ షోతోపాటు ఎలాంటి సినిమా షూటింగ్ ల్లో కూడా పాల్గొన‌రాద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె వెల్ల‌డించారు. రోజా దాదాపు ప‌దేళ్ళుగా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో జ‌డ్జీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మ‌న్ గా ఉన్న స‌మ‌యంలో కూడా ఆమె ఈ షో పాల్గొన్నారు.

ఇప్పుడు మంత్రి ప‌ద‌వి రావటంతో దీనికి గుడ్ బై చెప్ప‌క త‌ప్ప‌లేదు. మంత్రి ప‌ద‌వి రావ‌టంతో రోజా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నా కూడా అదే సామాజిక‌వ‌ర్గానికి రోజాకు కూడా జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి కేటాయించారు.దీంతో ఒక్క మాట‌లో చెప్పాలంటే రోజా జీవిత కాల కోరిక నెర‌వేరిన‌ట్లే. మంత్రి ప‌ద‌వి గురించి ఆమె సోమ‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ జ‌గన్ ఇచ్చిన‌ మంత్రి ప‌ద‌వికి న్యాయం చేస్తా అని ప్ర‌క‌టించారు.

Next Story
Share it