Telugu Gateway
Andhra Pradesh

బాబాయ్ కోసం అబ్బాయ్

బాబాయ్ కోసం అబ్బాయ్
X

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చివరి రోజు హీరో రామ్ చరణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించటం ఆసక్తికరంగా మారింది. ఆయన తన తల్లి సురేఖ, అల్లు అరవింద్ తో కలిసి పిఠాపురం లో కుక్కుటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. అయితే ఈ టూర్ పక్కా ప్లాన్ ప్రకారమే బాబాయ్ కి అండగా ఉన్నామని చెప్పటానికే రామ్ చరణ్ ఈ ట్రిప్ పెట్టుకున్నట్లు చెపుతున్నారు. దేవాలయ సందర్శన అనంతరం రామ్ చరణ్ పిఠాపురం లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. ఇంటి నుంచే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ జన సైనికులు, అభిమానులకు అభివాదం చేశారు. పవన్ వదిన సురేఖ, అల్లు అరవింద్ లు కూడా ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఒక వైపు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళితే..మరో వైపు బాబాయ్ కోసం రామ్ చరణ్ పిఠాపురం లో పర్యటించటం ప్రచారం చివరి రోజు హాట్ టాపిక్ గా మారింది అనే చెప్పాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ లోని వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లు పిఠాపురం లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.

వీళ్ళతో పాటు హీరో నాని, తేజ సజ్జ తదితరులు కూడా పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటనలు చేశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర ప్రచారంలో టాలీవుడ్ మొత్తం ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కోసం తమ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన హీరో లు ఎవరూ కూడా స్పందించలేదు. సొంత కుటుంబంలోని చిరంజీవే ఒక్క పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని అని కోరారు తప్ప...కనీసం జన సేన అభ్యర్థులకు కూడా అండగా నిలబడలేదు. అంతకు ముందు ఆయన బీజేపీ అనకాపల్లి లోక్ సభ అభ్యర్థి సి ఎం రమేష్, పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు కు మద్దతుగా ముందు ఒక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అంత తప్ప మిగిలిన అభ్యర్థుల విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

Next Story
Share it