Telugu Gateway
Andhra Pradesh

పులివెందుల‌...630 కోట్ల‌తో ఆద‌ర్శ ప‌ట్ట‌ణంగా

పులివెందుల‌...630 కోట్ల‌తో ఆద‌ర్శ ప‌ట్ట‌ణంగా
X

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌పై వ‌రాల వ‌ర్షం కురిపించారు. పులివెందులను రూ.630 కోట్లతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని ప్ర‌క‌టించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలోని మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు సీఎం జగన్ గురువారం నాడు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్‌ కోసం రూ.154 కోట్లు కేటాయించామని తెలిపారు. పులివెందుల రోడ్డును ఫోర్‌లైన్‌ రోడ్డుగా మారుస్తున్నామని, రూ.30 కోట్లతో స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజ్‌, నర్సింగ్‌ కాలేజ్‌ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Next Story
Share it