Telugu Gateway
Andhra Pradesh

విమానాశ్ర‌యం ద‌గ్గ‌ర ప‌వ‌న్ ఫ్యాన్స్ ను అడ్డుకున్న పోలీసులు

విమానాశ్ర‌యం ద‌గ్గ‌ర  ప‌వ‌న్ ఫ్యాన్స్ ను అడ్డుకున్న పోలీసులు
X

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అధికార వైసీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. ఈ త‌రుణంలో ప‌వ‌న్ బుధ‌వారం నాడు మంగ‌ళ‌గిరిలో జ‌ర‌గ‌నున్న పార్టీ స‌మావేశంలో పాల్గొనేందుకు విజ‌య‌వాడ వెళ్లారు. ఆయ‌న గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి ప్ర‌త్యేక విమానంలో చేరుకున్నారు. అయితే ప‌వ‌న్ కు స్వాగ‌తం ప‌లికేందుకు వ‌చ్చిన ఆయ‌న అభిమానుల‌ను పోలీసులు అడ్డుకున్నారు. విమానాశ్ర‌యం గేటు వ‌ద్దే వీరిని లోప‌లికి వెళ్ళ‌కుండా నిరోధించారు. ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ప్రతి వాహనాన్ని గన్నవరం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

తూర్పు ఏసీపీ విజయ్ పాల్ నేతృత్వంలో గన్నవరం సీఐ శివాజీ బృందం ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన రిప‌బ్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మా సినిమా టిక్కెట్లు మీరు అమ్మేది ఏంటి అంటూ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం మ‌ట‌న్, సినిమా టిక్కెట్లు అమ్ముతుందా అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అయితే ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌కు ప‌లువురు ఏపీ మంత్రులు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు.

Next Story
Share it