పిఠాపురం..ఈ సారి ప్రత్యేకం
దీనిపై సొంత పార్టీ నాయకుల నుంచి కూడా అసంతృప్తి వెల్లువెత్తగా....ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో భాగస్వాములం అవుతామని..అందరికి న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పవన్ కళ్యాణ్ కు గ్యారంటీగా ఉప ముఖ్యమంతి పదవి ఖాయం అనే అభిప్రాయం అటు టీడీపీ తో పాటు జన సేన వర్గాల్లో కూడా ఉంది. ఇది ఇలా ఉంటే..ఎన్నికల ప్రచారం లో చివరి రోజు పిఠాపురం లో వైసీపీ అభ్యర్థి వంగా గీత తరపున ప్రచారం చేసిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే తన క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రి ఇస్తానని ప్రకటించారు. ఈ లెక్కన టీడీపీ కూటమి గెలిచినా...వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చినా కూడా పిఠాపురానికి మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం ఖాయం అని చెప్పొచ్చు. అయితే జగన్ గతంలో ఇలాగే మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది ఒక్కటే కాదు...ఇలాంటి హామీలు మరికొన్ని ఇచ్చి కూడా జగన్ వాటిని అమలు చేయలేదు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.