Telugu Gateway
Andhra Pradesh

పిక్ ఆప్ ద డే..ప‌రిటాల శ్రీరామ్..జె సీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

పిక్ ఆప్ ద డే..ప‌రిటాల శ్రీరామ్..జె సీ ప్ర‌భాక‌ర్ రెడ్డి
X

అనంత‌పురం రాజ‌కీయాల్లో ప‌రిటాల ఫ్యామిలీకి..జెసీ ఫ్యామిలీకి మ‌ధ్య బ‌ద్ధ‌వైరం ఉంది. ఈ ఇరు గ్రూపుల మ‌ధ్య ఎప్పుడూ స‌యోధ్య‌లేదు. వైఎస్ మ‌ర‌ణం అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాల్లో జె సీ ఫ్యామిలీ టీడీడీలో చేరినా వీరి మ‌ధ్య స‌ఖ్య‌త సాధ్యం కాలేదు.నిత్యం ఎవ‌రికి వారే అన్న తీరుతో ముందుకు సాగే వారు. బుధ‌వారం నాడు చోటుచేసుకున్న ప‌రిణామం మాత్రం అనంత‌పురం జిల్లా వాసుల‌తోపాటు టీడీపీ శ్రేణుల‌ను షాక్ కు గురిచేసిందన‌నే చెప్పొచ్చు. టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ బుధ‌వారం నాడు అనంత‌పురం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.

ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు జె సీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తోపాటు ప‌రిటాల శ్రీరామ్ ఇత‌ర నేత‌లు అక్క‌డ‌కు చేరుకున్నారు. అక్క‌డే ఈ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌న పిల్లొడే అంటూ ప‌రిటాల శ్రీరామ్ ను జె సీ ప్ర‌భాక‌ర్ రెడ్డి అప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ మాటలు క‌లిపారు. ప‌రిటాల ర‌వి హ‌త్య లో జె సీ ఫ్యామిలీ హ‌స్తం ఉంద‌నే ఆరోప‌ణ‌లు అప్ప‌ట్లో టీడీపీ నేత‌లు చేసేవారు. మారిన రాజ‌కీయాల్లో ఇప్పుడు ఈ క‌ల‌యిక అనంత రాజ‌కీయాల్లో ఎన్ని మార్పుల‌కు శ్రీకారం చుడుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it