తిరుమలలో పవన్ కళ్యాణ్
BY Admin22 Jan 2021 4:52 AM GMT
X
Admin22 Jan 2021 4:59 AM GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు తిరుమలలో వెంకటేశ్వరస్వామని దర్శించుకున్నారు. ఆయనతోపాటు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు ఇతర నేతలు ఉన్నారు. జనసేన పీఏసీ సమావేశం గురువారం నాడు తిరుపతిలో జరిగింది. త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై కూడా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఓ వైపు బిజెపి నేతలు తిరుపతి బరిలో నిలిచేది తామే అని ప్రకటించుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఢిల్లీ స్థాయిలో చర్చలు జరగాల్సి ఉందని..అప్పుడు సీటు ఎవరికి అనే విషయంలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. తిరుపతి సీటు విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా జనసేన క్యాడర్ ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్ధి మాత్రమే బరిలో ఉండాలని కోరుతున్నారు.
Next Story