రైతుల పరామర్శకు పవన్ కళ్యాణ్
BY Admin30 Nov 2020 2:24 PM GMT
X
Admin30 Nov 2020 2:24 PM GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివర్ తుఫాను బాధితులను పరామర్శించాలని నిర్ణయించారు. ఆయన డిసెంబర్ 2న కృష్ణా,గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. 3,4,5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించటంతోపాటు ఆయా జిల్లాలో పవన్ కళ్యాణ్ రైతులతో ముఖాముఖి సమావేశం కానున్నారు.
నివర్ ప్రభావిత జిల్లాల జనసేన నాయకుల నుంచి ఆదివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కల్యాణ్ క్షేత్ర స్థాయి సమాచారాన్ని తెలుసుకున్నారు. రైతాంగం కడగండ్లను నాయకులు వివరించారు. దీంతో తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి రైతులతో స్వయంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Next Story