Telugu Gateway
Andhra Pradesh

జనసేన అధినేత పోటీ చేసే సీటు ఫిక్స్

జనసేన అధినేత పోటీ చేసే సీటు ఫిక్స్
X

సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చేసింది. ఈ ఎన్నికల్లో తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలవబోతున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తున్నట్లు..ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదు అని తెలిపారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి పరాజయం పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి ఎక్కడ నుంచి బరిలో దిగుతారు అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఉన్న విషయం తెలిసిందే.

జన సేన తొలి జాబితాలో కూడా పవన్ కళ్యాణ్ పేరు లేదు. దీంతో అయన గతంలో బరిలో నిలిచిన భీమవరం లో పోటీ చేస్తారా లేక కొత్త నియోజకవర్గం వైపు చూస్తారా అంటూ రకరకాల చర్చలు సాగాయి. పవన్ కళ్యాణ్ గురువారం నాడు చేసిన ప్రకటనతో సస్పెన్స్ కు తెరపడింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జన సేన, బీజేపీ లు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ సీట్లు , రెండు లోక్ సభ సీట్లలో పోటీ చేయనుంది.

Next Story
Share it