Telugu Gateway
Andhra Pradesh

డిమాండ్ చేస్తే పదవులు రావు

డిమాండ్ చేస్తే పదవులు రావు
X

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల దారులు క్లియర్ అవుతున్నాయి. ఎప్పటి నుంచో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని విషయంలో క్లారిటీ ఉన్నా...సొంత పార్టీ జనసేన కు చెందిన వారితో పాటు చాలా మంది పవన్ కళ్యాణ్ సీఎం అయితేనే టీడీపీ తో పొత్తు పెట్టుకోవాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. దీని ప్రధాన ఉద్దేశం ఎలాగైనా టీడీపీ, జనసేన పొత్తును బ్రేక్ చేయటం కోసం తెరవెనక ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ సీఎం పదవి విషయంపై క్లారిటీ ఇచ్చారు. తమ ప్రధాన ఉద్దేశం అధికార వైసీపీ ని ఓడించటం, రాష్ట్రాన్ని ఆ పార్టీ నుంచి కాపాడాడటమే అన్నారు. సీఎం పదవి కావాలని టీడీపీ, బీజేపీ ని అడగటం కాదు అని...సొంతంగా సాధించుకోవాలన్నారు. సినిమాల్లో కూడా తాను స్టార్ అయ్యాను అంటే అది అడిగి తీసుకున్నది కాదు అని...సొంతంగా సంపాదించుకున్నది అన్నారు. గత ఎన్నికల్లో 134 సీట్లలో పోటీ చేస్తే కనీసం 30 నుంచి 40 సీట్లలో గెలిపించే ఉంటే అప్పుడు సీఎం సీట్ డీమాండ్ చేయటానికి ఛాన్స్ ఉండేది అన్నారు. బలం ఆధారంగానే గౌరవప్రదమైన సీట్లు అడుగుతామని స్పష్టం చేశారు. గతం కంటే ఇప్పుడు కచ్చితంగా తమ బలం పెరిగింది అని చెప్పారు. అయితే ఎక్కడ బలం ఉందో చూసుకుని ఆ దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. రాష్ట్రం కోసం పనిచేస్తున్నాను.. ఒక కులం కోసం కాదు. నాతో నడిచేవాళ్లంతా నా వాళ్లే’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు పార్టీలను గౌరవిస్తామని, ఎన్నికలను ప్రభావితం చేసే పార్టీలు కలవాలని ఆకాంక్షించారు.

లెఫ్ట్ పార్టీలు వస్తే మంచిదే.. కానీ వారు రారని విమర్శించారు. తాను పార్టీ పెట్టింది ఉనికి చాటుకోవడానికి కాదని ప్రకటించారు. అంతకు ముందు అయన అకాల వర్షాలతో దెబ్బ తిన్న రైతులను పరామర్శించారు గురువారం నాడు అయన విజయవాడ లో మీడియా తో మాట్లాడారు. ప్రభుత్వం రైతులను క్రిమినల్స్‌లా చూస్తోందని పవన్ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. వ్యవసాయ పనులు ఉన్నప్పుడే ఉపాధి హామీ పనులు పెడుతున్నారని, సమయానికి కూలీలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అకాల వర్షాలతో రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం రావట్లేదని.. రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. మంత్రులు సాయం చేయకపోగా అవమానకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులకు ఎకరాకు రూ.8,100 నష్టం వాటిల్లిందని, ప్రశ్నించే రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రావడంతో కొందరు రైతుల అకౌంట్‌లో డబ్బులు వేశారని, కానీ బ్యాంక్‌ వాళ్లు రూ.5 వేల కంటే ఎక్కువ ఇవ్వడం లేదని విమర్శించారు. అకౌంట్‌లో డబ్బులు లేవని బ్యాంక్ వాళ్లు అంటున్నారని పేర్కొన్నారు.

Next Story
Share it