Telugu Gateway
Andhra Pradesh

కారుపై ప‌డిపోయిన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

కారుపై ప‌డిపోయిన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా రోజుల త‌ర్వాత బ‌హిరంగ రాజ‌కీయ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో అపశృతి చోటుచేసుకుంది. ఆయ‌న కారుపై ఉండి కార్య‌క‌ర్త‌ల‌కు అభివాదం చేస్తుండగా వెన‌క నుంచి అభిమాని దూకుడుగా వ‌చ్చి ఆయ‌న్న కౌగిలించుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా..ప‌వ‌న్ క‌ళ్యాణ్ కారుపై ప‌డిపోయారు. అభిమాని కూడా కారుపైనుంచి కింద‌ప‌డ్డారు. ఇందులో ఎవ‌రికీ పెద్ద‌గా దెబ్బ‌లు త‌గ‌ల‌క‌పోవ‌టం అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. నరసాపురం మత్స్యకార అభ్యున్నతి సభ లో పాల్గొనేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న తల‌పెట్టారు.

రాజ‌మండ్రి నుంచి న‌ర‌సాపురానికి ర్యాలీగా వెళుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌త్స‌కారుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం మోసం చేసింద‌న‌ని ఆరోపిస్తూ గ‌త కొన్ని రోజులుగా జ‌న‌సేన ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. పార్టీ పీఏసీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కొన్ని రోజులుగా అక్క‌డే ప‌ర్య‌టిస్తూ జిల్లాలోని మ‌త్స‌కార కుటుంబాల‌తో వ‌ర‌స స‌మావేశాలు ఏర్పాటు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌హిరంగ స‌భ‌తో వీరి స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తి ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచాల‌ని నిర్ణ‌యించారు.

Next Story
Share it